షార్జా: 33 ఫుడ్ ఔట్లెట్స్కి జరీమానా
- August 01, 2017
అల్ దైద్ మునిసిపాలిటీ 33 ఫుడ్ ఔట్లెట్స్కి జరీమానాలు విధించగా, 93 ఎస్టాబ్లిష్మెంట్స్కి వార్నింగ్ ఇచ్చింది. పబ్లిక్ హెల్త్ కండిషన్స్, రెగ్యులేషన్స్కి సంబంధించి ఈ చర్యలు తీసుకున్నట్లు అల్ దైద్ మునిసిపాలిటీ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అహ్మద్ ముస్సాబా అల్ తునైజి చెప్పారు. ఈ వేసవిలో 149 ఎస్టాబ్లిష్మెంట్స్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. గ్రాసరీస్, సూపర్ మార్కెట్, కెఫెటేరియాస్, రెస్టారెంట్స్ ఇందులో ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఈ తనిఖీలను నిర్వహించడం జరిగింది. ఆహార పదార్థాల్ని తయారు చేసే క్రమంలో, వాటిని విక్రయించే క్రమంలో ఆయా ఎస్టాబ్లిష్మెంట్స్లో సిబ్బంది భద్రతా ప్రమాణాలు, హెల్త్ కండిషన్స్, పరిశుభ్రత పాటించాలని ఈ సందర్భంగా అహ్మద్ ముస్సబా హెచ్చరించారు. ఎయిర్ కండిషన్లను ఆపివేయడం, రాత్రి వేళ్ళలో రిఫ్రిజిరేటర్లను ఆపివేయడం వంటి చర్యల ద్వారా ఆహార పదార్థాలు పాడైపోతున్నట్లు గుర్తించినట్లు ఆయన వివరించారు. ఎప్పటికఫ్పుడు తనిఖీలు జరుగుతుంటాయి గనుక ఆయా సంస్థల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలనీ, పరిశుభ్ర వాతావరణంలో వినియోగదారులకు ఫుడ్ ఐటమ్స్ సప్లయ్ చేయాలని స్పష్టం చేశారు అల్ తనైజి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







