ఇంట్లో గంజాయి వనం నిర్వహిస్తున్న బహ్రెయిన్ వ్యక్తి అరెస్టు
- August 04, 2017మనామా: తులసి వనంలో ..గంజాయి మొక్క కాదు ...ఏకంగా పూల కుండీలలలో మత్తుని కల్గించే గంజాయి మొక్కలను ఏపుగా పెంచుతున్న ఓ బహ్రెయిన్ నిందితుడిని ఇటీవల అరెస్ట్ చేసినట్లు అధికారులు చెప్పారు. పనికిరాని ఆ పచ్చ"ధనం" ను నిలువరించినట్లు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ జనరల్ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్జిజి అల్ అల్మామిచే విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం 31 ఏళ్ల అనుమానితుడు అనేక గంజాయి మొక్కలను తన పెరటిలో పెంచుతున్నట్లు పేర్కొన్నారు. మొక్కలు, మరియు విత్తనాలను సస్య రక్షణ పద్దతులతో గంజాయి తోటను సంరక్షిస్తున్నట్లు ఆ అధికారి పేర్కొన్నాడు. గంజాయి కోతకు వచ్చిన తర్వాత ఆ కొమ్మలను ఆకులను నూర్చి వాటితో కుటీర పరిశ్రమ మాదిరిగా ఇంటివద్దనే మాదకద్రవ్యాలను తయారుచేస్తున్నారు. తయారుచేసే పరికరాలు పెద్ద మొత్తంలో డబ్బుని నిందితుని వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అనుమానితుడు మాదకద్రవ్యాల తయారీకి తగిన స్థలంని ఎంచుకొని మరియు చిన్న తరహా కుటీర పరిశ్రమ మాదిరిగా అక్కడ పర్యావరణాన్ని తయారుచేసినట్లు నిందితునిపై అన్ని సాక్ష్యాలు ఆధారాలు నిరూపించబడటంతో ఆ ప్రదేశాన్ని జప్తు చేశారు ఈ కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు పంపించబడినట్లు అల్ రూమికి తెలిపారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..