'జై లవ కుశ' టీజర్
- August 05, 2017
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవ కుశ' నుండి మరో టీజర్ రాబోతోంది. మరోవైపు విడుదలకు ముస్తాబవుతోన్న ఈ చిత్రం బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతోందట!
'జై లవ కుశ'లో మొదటిసారి త్రిపాత్రాభినయం చేస్తూ తారక్ అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాల్ని పెంచేశాడు. ఇక ఈ చిత్రంలోని 'జై' పాత్రకు సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలయ్యింది. ప్రతినాయక ఛాయలతో ఉన్న 'జై' పాత్రలో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇప్పుడు ఈ చిత్రంలోని మరో క్యారెక్టర్ 'లవ' టీజర్ను రాఖీ కానుకగా ఈ నెల 7న విడుదల చేయనున్నారట.
దసరా కానుకగా సెప్టెంబర్ 21న విడుదల కాబోతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నివేదా థామస్, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ను హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ 10.5 కోట్ల రూపాయలకు దక్కించుకున్నారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తోన్న ఈ చిత్రం ఆడియో త్వరలోనే విడుదలకాబోతోంది.
ఒకవైపు 'జై లవ కుశ' సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మరోవైపు 'బిగ్ బాస్' షోతో బుల్లితెరపై తన సత్తా చాటుతున్నాడు. ఇక ఈ రియాలిటీ షోకి ఇప్పుడు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. తాజాగా.. ఎన్టీఆర్ కనిపించే వీకెండ్ ఎపిసోడ్స్కు.. రికార్డ్ లెవెల్లో 12.3 టి.ఆర్.పి వచ్చిందట. పార్టిసిపెంట్స్కు కొత్త కొత్త టాస్క్ లు ఇస్తూ సరికొత్త ట్విస్ట్లతో.. మంచి క్రేజ్ సంపాదించుకుంటోన్న 'బిగ్ బాస్' షో సూపర్ హిట్ అంటున్నారు నిర్వాహకులు. మొత్తంమీద బుల్లితెరపై కూడా యంగ్ టైగర్ తన మార్కు చూపించాడన్నమాట.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







