తెలంగాణ క్లస్టర్ కు కేంద్రం ఆమోదం
- August 06, 2017
తెలంగాణలో రూ.437 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయ తలపెట్టిన ఎలక్ట్రానిక్స్ మానుఫాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ)కు కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) సమర్పించిన ప్రతిపాదనలకు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు తెలిపాయి. 310 ఎకరాల్లో ఈ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణకు ఇది రెండో క్లస్టర్ కావడం గమనార్హం. అంతకుముందు 600 ఎకరాల్లో రూ.667 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయ తలపెట్టిన క్లస్టర్కు టీఎస్ఐఐసీ ప్రతిపాదనలు పంపగా సంబంధిత మంత్రిత్వ శాఖ జులైలో ఆమోదం తెలిపింది. ఈఎంసీ స్కీమ్ కింద ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం కేంద్రం సాయంగా అందిస్తుంది. మొత్తంగా దేశంలో ఇప్పటి వరకు 15 ఈఎంసీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







