తెలంగాణ క్లస్టర్ కు కేంద్రం ఆమోదం
- August 06, 2017
తెలంగాణలో రూ.437 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయ తలపెట్టిన ఎలక్ట్రానిక్స్ మానుఫాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ)కు కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) సమర్పించిన ప్రతిపాదనలకు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు తెలిపాయి. 310 ఎకరాల్లో ఈ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణకు ఇది రెండో క్లస్టర్ కావడం గమనార్హం. అంతకుముందు 600 ఎకరాల్లో రూ.667 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయ తలపెట్టిన క్లస్టర్కు టీఎస్ఐఐసీ ప్రతిపాదనలు పంపగా సంబంధిత మంత్రిత్వ శాఖ జులైలో ఆమోదం తెలిపింది. ఈఎంసీ స్కీమ్ కింద ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం కేంద్రం సాయంగా అందిస్తుంది. మొత్తంగా దేశంలో ఇప్పటి వరకు 15 ఈఎంసీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









