తెలంగాణ క్లస్టర్ కు కేంద్రం ఆమోదం

- August 06, 2017 , by Maagulf
తెలంగాణ క్లస్టర్ కు కేంద్రం ఆమోదం

తెలంగాణలో రూ.437 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయ తలపెట్టిన ఎలక్ట్రానిక్స్‌ మానుఫాక్చరింగ్‌ క్లస్టర్‌(ఈఎంసీ)కు కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) సమర్పించిన ప్రతిపాదనలకు ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు తెలిపాయి. 310 ఎకరాల్లో ఈ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణకు ఇది రెండో క్లస్టర్‌ కావడం గమనార్హం. అంతకుముందు 600 ఎకరాల్లో రూ.667 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయ తలపెట్టిన క్లస్టర్‌కు టీఎస్‌ఐఐసీ ప్రతిపాదనలు పంపగా సంబంధిత మంత్రిత్వ శాఖ జులైలో ఆమోదం తెలిపింది. ఈఎంసీ స్కీమ్‌ కింద ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం కేంద్రం సాయంగా అందిస్తుంది. మొత్తంగా దేశంలో ఇప్పటి వరకు 15 ఈఎంసీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com