ఉత్తర కొరియా కు కళ్లెం వేస్తున్న అమెరికా
- August 06, 2017
అణ్వస్త్ర ప్రయోగాలతో అగ్రరాజ్యాన్ని కలవరపెడుతున్న ఉత్తర కొరియా దూకుడుకు కళ్లెం వేసే దిశగా అమెరికా కీలక విజయం సాధించింది. ఆ దేశ ఎగుమతులపై ఆంక్షలు విధించాలంటూ అమెరికా ప్రవేశ పెట్టిన ముసాయిదా తీర్మానాన్ని సమర్థిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎగుమతుల ద్వారా అర్జిస్తున్న ధనంలో రూ.100 కోట్ల డాలర్ల విదేశీ ద్రవ్యాన్ని ఉత్తర కొరియా నష్టపోవాల్సి వస్తోంది. అమెరికాను నాశనం చేయగల అణువార్ హెడ్లు తమ వద్ద ఉన్నాయంటూ కొంతకాలంగా అణు ప్రయోగాలు చేస్తూ ఉత్తరకొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. రష్యా, చైనాలు ఉత్తరకొరియాకు ప్రధాన ఆర్థిక భాగస్వాములుగా ఉన్నాయంటూ ఆరోపిస్తున్న అమెరికా.. ఈ దేశాలతో వాణిజ్య సంబంధాలతో అర్జిస్తున్న ధనాన్ని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్జంగ్ హుంగ్ అణుప్రయోగాలపై ఖర్చు చేస్తున్నారని ఆక్షేపిస్తుంది. ఎగుమతులపై నిషేధం విధించడం ద్వారా అణ్వస్త్ర ప్రయోగాల్లో ఉత్తరకొరియా దూకుడు స్వభావాన్ని నియంత్రించాలంటూ అమెరికా ఐరాస భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. తీర్మానం ఆమోదం పొందడం వల్ల ఉత్తరకొరియా ప్రధాన ఎగుమతులైన బొగ్గు, ఇనుపఖనిజం, సముద్ర ఉత్పత్తులు నిలిచిపోనున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







