పట్టణాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
- August 06, 2017
పట్టణాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది. నగరాలు, పట్టణాల్లో నివాసముంటున్న వారికి కారు, ఫ్రిజ్, ఏసీ ఉన్నాయా ? అయితే సంక్షేమ పథకాలు పొందేందుకు మీరు అర్హులు కాదంటూ కేంద్రం నియమించిన దేబ్రాయ్ కమిటీ బాంబులాంటి వార్త పేల్చింది. నాలుగు గదుల ఇల్లున్నా, కారు లేదా ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ద్విచక్రవాహనం ఉంటే మీకు సర్కారు సంక్షేమ పథకాల ఫలాలు పొందటానికి అర్హులు కాదంటూ బిబేక్ దెబ్రాయ్ కమిటీ సిఫార్సు చేసింది.తాజాగా జరపనున్న సాంఘీక ఆర్థిక సర్వేలో పట్టణ వాసులకు పైన పేర్కొన్న వస్తువులు ఇంట్లో ఉంటే సంక్షేమ పథకాలు అందవని కమిటీ స్పష్టం చేసింది. ఇల్లు లేని వారు, పాలిథీన్ కవర్ల గుడిసెల్లో నివాసముండేవారు, ఎలాంటి ఆదాయం లేని, మగవారు లేని ఇళ్ల వారికి, పిల్లలు సంక్షేమ పథకాలు పొందవచ్చని కమిటీ చెప్పింది. మొత్తంమీద పట్టణాల్లో నివాసముంటున్న వారిలో 59 శాతం మంది సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







