చంద్రగ్రహణం, రెండు తెలుగు రాష్ర్టాల్లో ఆలయాల మూసివేత

- August 06, 2017 , by Maagulf
చంద్రగ్రహణం, రెండు తెలుగు రాష్ర్టాల్లో ఆలయాల మూసివేత

చంద్రగ్రహణం నేపథ్యంలో సోమవారం సాయంత్రం నుంచి తెలుగు రాష్ర్టాల్లోని దేవాలయాలను మూసివేయనున్నారు. గ్రహణం ఘడియలు సోమవారం రాత్రి 10.52 ప్రారంభమై అర్ధరాత్రి 12.48 గంటలకు పూర్తవుతాయి. సోమవారం సాయంత్రం 4.30 నుంచి మంగళవారం వేకువజామున 2 గంటల వరకు క్లోజ్ చేయనున్నారు. మంగళవారం వేకువజామున 2 గంటలకు ఆలయ తలుపులు తెరచి మందిర శుద్ధి, పుణ్యాహవచనం చేపట్టనున్నట్లు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు.
స్వామివారికి అన్నిరకాల సేవలు పూర్తయిన తర్వాత మంగళవారం ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు చెప్పారు. అలాగే గ్రహణం సమయంలో కంపార్ట్‌మెంట్లలోకి భక్తులను అనుమతించమని, అన్నప్రసాద వితరణను నిలిపివేస్తామని స్పష్టంచేశారు. అన్నవరం సత్యనారాయణ స్వామి, విజయవాడ కనకదుర్గ దేవాలయం, శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి ఆలయం, భద్రాచలం రామాలయం, యాదగిరిగుట్ట ఆలయాలతో పాటు ఇతర ఆలయాలను చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com