మోదీ అమరావతి శంకుస్థాపన చేశారు

- October 22, 2015 , by Maagulf
మోదీ అమరావతి శంకుస్థాపన చేశారు

చరిత్రలో కొత్త పుట... కొత్త అధ్యాయం...సువర్ణాక్షర లిఖితం. ఆంధ్రుల వైభవ దీప్తికి మరో మైలురాయి. నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం 12.36-12.43 గంటల మధ్య మోదీ... అమరావతి శంకుస్థాపన చేశారు. ఈ ప్రధాన క్రతువు ముగిసిన అనంతరం ప్రధాని పూర్ణాహుతి, రత్నన్యాసం, శిలాన్యాసం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం శంకుస్థాపన శిలా ఫలకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, ఎంపీ సుజనా చౌదరి, గవర్నర్ నరసింహన్, జపాన్, సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రధాన వేదికకు పక్కనే ఏర్పాటు చేసిన అమరావతి గ్యాలరీని మోదీ సందర్శించారు. ఆ గ్యాలరీని ఆయన ఆసక్తిగా తిలకరించారు. ఆ తర్వాత రాజధాని మాన్టర్ ప్లాన్ ను అధికారులు... ప్రధానికి వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com