మోదీ అమరావతి శంకుస్థాపన చేశారు
- October 22, 2015
చరిత్రలో కొత్త పుట... కొత్త అధ్యాయం...సువర్ణాక్షర లిఖితం. ఆంధ్రుల వైభవ దీప్తికి మరో మైలురాయి. నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం 12.36-12.43 గంటల మధ్య మోదీ... అమరావతి శంకుస్థాపన చేశారు. ఈ ప్రధాన క్రతువు ముగిసిన అనంతరం ప్రధాని పూర్ణాహుతి, రత్నన్యాసం, శిలాన్యాసం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం శంకుస్థాపన శిలా ఫలకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, ఎంపీ సుజనా చౌదరి, గవర్నర్ నరసింహన్, జపాన్, సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రధాన వేదికకు పక్కనే ఏర్పాటు చేసిన అమరావతి గ్యాలరీని మోదీ సందర్శించారు. ఆ గ్యాలరీని ఆయన ఆసక్తిగా తిలకరించారు. ఆ తర్వాత రాజధాని మాన్టర్ ప్లాన్ ను అధికారులు... ప్రధానికి వివరించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







