పాకిస్తాన్ లాహోర్లో మళ్లీ పేలుడు
- August 08, 2017
పాకిస్తాన్ రెండో ఆర్థిక రాజధాని లాహోర్ మరోసారి పేలుడుతో దద్దరిల్లింది. పండ్లతో నిండిన ట్రక్కులో అమర్చిన శక్తిమంతమైన బాంబు పేలడంతో 34 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పండ్ల మార్కెట్ వద్ద సోమవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు, భవంతులు ధ్వంసమయ్యాయి.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని లాహోర్ ప్రభుత్వ ఉన్నతాధికారి అబ్దుల్ ఖాన్ సుంబాల్ మీడియాకు తెలిపారు. బాంబు అమర్చిన వాహనం ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
కొద్ది రోజుల కిందటే లాహోర్లోని ప్రఖ్యాత కూరగాయల మార్కెట్లో పాక్తాలిబన్లు జరిపిన పేలుళ్లలో 26 మంది చనిపోగా, పదుల మంది గాయపడిన సంగతి తెలిసిందే. తాజా ఘటనకు బాధ్యులు ఎవరనేది తెలియాల్సిఉంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









