టెర్రర్‌ కేసుల పట్ల మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

- August 09, 2017 , by Maagulf
టెర్రర్‌ కేసుల పట్ల మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

కువైట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, తీవ్రవాదం కేసులకు సంబంధించి వ్యక్తుల పేర్లను మీడియా ప్రస్తావించేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇటువంటి కేసుల్లో నిందితుల పేర్లను ప్రస్తావించడంలో అత్యుత్సాహం చూపితే, ఆయా కేసుల విచారణలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని ప్రాసిక్యూటర్‌ చెప్పారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాతోపాటు, సోషల్‌ మీడియాలోనూ ఈ విషయమై బాధ్యతాయుతంగా వ్యవహరించడం అవసరమని చెప్పారాయన. కొన్ని కేసుల్లో నిందితులు తప్పించుకుంటుంటారనీ, అలాంటి సందర్భాల్లో సీక్రెట్‌ ఆపరేషన్స్‌ నడుస్తుంటాయి గనుక విచారణ కీలక దశలో ఉన్నప్పుడు మీడియా అత్యుత్సాహం చూపడం ఆయా కేసులకు ఇబ్బందికరమని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com