చాల రోజులు తరువాత కొడుకు సినిమాలో తండ్రి
- August 10, 2017
సూపర్స్టార్ కృష్ణ.. 'కొడుకు దిద్దిన కాపురం', 'ముగ్గురు కొడుకులు' 'గూఢాచారి 117' తదితర చిత్రాల్లో తన కుమారుడు ప్రిన్స్ మహేశ్బాబుతో కలిసి నటించారు. ఆ తర్వాత మహేశ్ కథానాయకుడిగా నటించిన 'రాజకుమారుడు', 'వంశీ', 'టక్కరి దొంగ' చిత్రాల్లో కృష్ణ అతిథి పాత్రల్లో కన్పించారు.
అయితే దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ తండ్రీకొడుకులు తెరపై కనువిందు చేయనున్నట్లు చిత్రవర్గాల సమాచారం. మహేశ్బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'భరత్ అనే నేను'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కైరా అడ్వాణీ కథానాయిక. ఇందులో కృష్ణ కీలక పాత్రలో నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అదే నిజమైతే మళ్లీ ఈ తండ్రీకొడుకులను తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు పండుగే.
అంతేకాదు.. ఈ సినిమాలో చాలా మంది సీనియర్ నటులు కన్పించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేశ్బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తుండడం విశేషం.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరో పక్క మహేశ్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న 'స్పైడర్' చిత్రంలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









