యుఎఇ ఎడారిలో ఇరుక్కుపోయిన ఇరువురు యూరోపియన్ పర్యాటకులు
- August 12, 2017
" అసలే తెల్ల తోలు ...ఆపై భగ భగ మండే వేసవికాలం... దీనికి తోడు ఎడారిలోదారితప్పి మోటార్ బైక్ పై ఎన్నో గంటల ప్రయాణం... దీంతో ఇద్దరు యూరోపియన్ పర్యాటకులు మండే ఎండకు వడదెబ్బ కొట్టి శోష వచ్చి అలసిపోయారు..ఎడారిలో తాగేందుకు గుక్కెడు నీళ్లు లేకుండా ద్వి చక్రవాహనాలలో పెట్రోల్ సైతం అయిపోయింది. ఇక మరణం తప్పదు అనుకొనే సమయంలో...వీరి ఇద్దరు కోసం భగవంతుడు పంపినట్లు ఒక ఎమిరాటీ వ్యక్తి అక్కడకు వచ్చి వారిని ఆ భయానక వేసవి వాతావరణం నుంచి రక్షించాడు. అలీ రషీద్ ఎమిరాటీ అనే వ్యక్తి ఎడారిలో అతని 4x4 వాహనంలో వారిని రక్షించాడు. అయితే ఆ ఇద్దరు అతిసారం వ్యాధితో బాధపడుతున్నారని గ్రహించాడు. తీవ్రమైన ఎండలలో వారు వెళ్ళవల్సిన ఎడారి దారిని సైతం తప్పిపోయినట్లు గ్రహించాడు ఎడారిలో గతంలో కొంత మంది నిర్మాణ బృందాలు పని చేస్తుండేవి కానీ వేసవి విరామ వేళలు అమలుకావడంతో మధ్యాహ్నం పనిని నిలిపివేశారు. దీంతో ఆల్ రషీద్ వెంటనే షార్జా పోలీసులను సహాయం కోసం పిలిచారు మరియు గస్తీ పోలీసుల వచ్చి వారిని రక్షించారు. ఆ ఇద్దరు eu రక్షించబడే వరకు వారికి ప్రథమ చికిత్స అందించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం









