యుఎఇ ఎడారిలో ఇరుక్కుపోయిన ఇరువురు యూరోపియన్ పర్యాటకులు
- August 12, 2017
" అసలే తెల్ల తోలు ...ఆపై భగ భగ మండే వేసవికాలం... దీనికి తోడు ఎడారిలోదారితప్పి మోటార్ బైక్ పై ఎన్నో గంటల ప్రయాణం... దీంతో ఇద్దరు యూరోపియన్ పర్యాటకులు మండే ఎండకు వడదెబ్బ కొట్టి శోష వచ్చి అలసిపోయారు..ఎడారిలో తాగేందుకు గుక్కెడు నీళ్లు లేకుండా ద్వి చక్రవాహనాలలో పెట్రోల్ సైతం అయిపోయింది. ఇక మరణం తప్పదు అనుకొనే సమయంలో...వీరి ఇద్దరు కోసం భగవంతుడు పంపినట్లు ఒక ఎమిరాటీ వ్యక్తి అక్కడకు వచ్చి వారిని ఆ భయానక వేసవి వాతావరణం నుంచి రక్షించాడు. అలీ రషీద్ ఎమిరాటీ అనే వ్యక్తి ఎడారిలో అతని 4x4 వాహనంలో వారిని రక్షించాడు. అయితే ఆ ఇద్దరు అతిసారం వ్యాధితో బాధపడుతున్నారని గ్రహించాడు. తీవ్రమైన ఎండలలో వారు వెళ్ళవల్సిన ఎడారి దారిని సైతం తప్పిపోయినట్లు గ్రహించాడు ఎడారిలో గతంలో కొంత మంది నిర్మాణ బృందాలు పని చేస్తుండేవి కానీ వేసవి విరామ వేళలు అమలుకావడంతో మధ్యాహ్నం పనిని నిలిపివేశారు. దీంతో ఆల్ రషీద్ వెంటనే షార్జా పోలీసులను సహాయం కోసం పిలిచారు మరియు గస్తీ పోలీసుల వచ్చి వారిని రక్షించారు. ఆ ఇద్దరు eu రక్షించబడే వరకు వారికి ప్రథమ చికిత్స అందించారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







