విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- January 19, 2026
దోహా: విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 1 నుండి అబు సమ్రా మీదుగా ఖతార్లోకి ప్రవేశించే విదేశీ వాహనాలు.. దేశంలోకి ప్రవేశించే ముందు ఎలక్ట్రానిక్గా వెహికల్ ఇన్సూరెన్స్ ను పొందే అవకాశాన్ని కల్పించారు. ఇది బార్డర్ ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేస్తుందని ప్రకటించారు.
ఖతార్ యూనిఫైడ్ ఇన్సూరెన్స్ బ్యూరో MSAR అనే ఎలక్ట్రానిక్ వ్యవస్థను ప్రారంభించింది. ఇది పర్యాటకులు వెహికల్ ఇన్సూరెన్స్ ప్రక్రియలను ఎలక్ట్రానిక్గా పూర్తి చేయడానికి అనుమతిస్తుంది. వాహనదారులు యాప్ ద్వారా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నిరంతరం అవసరమైన టెక్నికట్ సపోర్టును కూడా పొందవచ్చు.
అయితే, చెల్లుబాటు అయ్యే ముందస్తు ఇన్సూరెన్స్ ఉన్న వాహనాలకు బార్డర్ వద్ద ప్రత్యేక లేన్ ఉంటుందని, ఇది వేగవంతమైన ఎంట్రీ ప్రక్రియకు వీలు కల్పిస్తుందని ఒక MSAR అధికారి వెల్లడించారు. కాగా, ఖతార్కు ఒకవేళ పర్యటన రద్దు అయిన సందర్భంలో ఇన్సూరెన్స్ ను సైతం రద్దు చేసుకుని, డబ్బులను రీ ఫండ్ పొందడానికి కూడా ఈ అప్లికేషన్లో అవకాశం ఉంటుందని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









