విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- January 19, 2026
దోహా: విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 1 నుండి అబు సమ్రా మీదుగా ఖతార్లోకి ప్రవేశించే విదేశీ వాహనాలు.. దేశంలోకి ప్రవేశించే ముందు ఎలక్ట్రానిక్గా వెహికల్ ఇన్సూరెన్స్ ను పొందే అవకాశాన్ని కల్పించారు. ఇది బార్డర్ ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేస్తుందని ప్రకటించారు.
ఖతార్ యూనిఫైడ్ ఇన్సూరెన్స్ బ్యూరో MSAR అనే ఎలక్ట్రానిక్ వ్యవస్థను ప్రారంభించింది. ఇది పర్యాటకులు వెహికల్ ఇన్సూరెన్స్ ప్రక్రియలను ఎలక్ట్రానిక్గా పూర్తి చేయడానికి అనుమతిస్తుంది. వాహనదారులు యాప్ ద్వారా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నిరంతరం అవసరమైన టెక్నికట్ సపోర్టును కూడా పొందవచ్చు.
అయితే, చెల్లుబాటు అయ్యే ముందస్తు ఇన్సూరెన్స్ ఉన్న వాహనాలకు బార్డర్ వద్ద ప్రత్యేక లేన్ ఉంటుందని, ఇది వేగవంతమైన ఎంట్రీ ప్రక్రియకు వీలు కల్పిస్తుందని ఒక MSAR అధికారి వెల్లడించారు. కాగా, ఖతార్కు ఒకవేళ పర్యటన రద్దు అయిన సందర్భంలో ఇన్సూరెన్స్ ను సైతం రద్దు చేసుకుని, డబ్బులను రీ ఫండ్ పొందడానికి కూడా ఈ అప్లికేషన్లో అవకాశం ఉంటుందని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!









