రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- January 19, 2026
రియాద్: దక్షిణ యెమెన్ నాయకులు, గిరిజన షేక్లు మరియు కమ్యూనిటీ ప్రముఖుల విస్తృత సంప్రదింపుల సమావేశం ఆదివారం రియాద్లో ప్రారంభమైంది. ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ సభ్యుడు అబు జర్ అల్-ముహర్రామి చర్చల అనంతరం చారిత్రాత్మక సందేశాన్ని చదివి వినిపించారు. దక్షిణ యెమెన్ భవిష్యత్తుకు ఉపయోగపడని వివాదాల నుండి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు.
సౌదీ అధికారులతో ప్రత్యక్ష సమావేశాల ద్వారా దక్షిణ యెమెన్ ప్రజల చట్టబద్ధమైన డిమాండ్లకు స్పష్టమైన హామీలు లభించాయని పేర్కొన్నారు. ప్రజలు తమ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునే మరియు స్వయం నిర్ణయాధికారాన్ని వినియోగించుకునే హక్కుతోపాటు పూర్తిగా సార్వభౌమ దక్షిణ యెమెన్ స్టేట్ పునరుద్ధరణ కూడా ఉందని తెలిపారు. అన్ని పార్టీలు, వ్యక్తులను కలుపుకొని ముందుకు పోతామని స్పష్టం చేశారు.
దక్షిణ యెమెన్ పౌరుల బాధలను తగ్గించే లక్ష్యంతో సౌదీ అరేబియా బాధ్యతాయుతమైన మరియు నిర్మాణాత్మక పాత్రను ప్రదర్శించిందని, ఇందుకు ధన్యవాదాలు తెలియజేశారు. దక్షిణ యెమెన్ మరియు సౌదీ అరేబియా మధ్య భవిష్యత్ భాగస్వామ్యానికి ఆర్థిక మద్దతు మరియు అభివృద్ధి ఒక మూలస్తంభంగా ఉంటుందని, ప్రస్తుతం భద్రత, స్థిరత్వం మరియు అభివృద్ధి ఆధారంగా వ్యూహాత్మక భవిష్యత్తుకు నిజమైన ప్రారంభంగా పేర్కొన్నారు. భవిష్యత్ లోనూ సౌదీ అరేబియా కీలక భాగస్వామిగా కొనసాగుతుందని వెల్లడించారు.
హౌతీలు మరియు ఇతర తీవ్రవాద గ్రూపులను దక్షిణ యెమెన్ ఎదుర్కొంటున్న ప్రాథమిక ముప్పుగా పేర్కొన్నారు. దక్షిణ యెమెన్ ప్రజల ఆకాంక్షలకు మద్దతు ఇవ్వాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







