రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- January 19, 2026
రియాద్: దక్షిణ యెమెన్ నాయకులు, గిరిజన షేక్లు మరియు కమ్యూనిటీ ప్రముఖుల విస్తృత సంప్రదింపుల సమావేశం ఆదివారం రియాద్లో ప్రారంభమైంది. ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ సభ్యుడు అబు జర్ అల్-ముహర్రామి చర్చల అనంతరం చారిత్రాత్మక సందేశాన్ని చదివి వినిపించారు. దక్షిణ యెమెన్ భవిష్యత్తుకు ఉపయోగపడని వివాదాల నుండి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు.
సౌదీ అధికారులతో ప్రత్యక్ష సమావేశాల ద్వారా దక్షిణ యెమెన్ ప్రజల చట్టబద్ధమైన డిమాండ్లకు స్పష్టమైన హామీలు లభించాయని పేర్కొన్నారు. ప్రజలు తమ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునే మరియు స్వయం నిర్ణయాధికారాన్ని వినియోగించుకునే హక్కుతోపాటు పూర్తిగా సార్వభౌమ దక్షిణ యెమెన్ స్టేట్ పునరుద్ధరణ కూడా ఉందని తెలిపారు. అన్ని పార్టీలు, వ్యక్తులను కలుపుకొని ముందుకు పోతామని స్పష్టం చేశారు.
దక్షిణ యెమెన్ పౌరుల బాధలను తగ్గించే లక్ష్యంతో సౌదీ అరేబియా బాధ్యతాయుతమైన మరియు నిర్మాణాత్మక పాత్రను ప్రదర్శించిందని, ఇందుకు ధన్యవాదాలు తెలియజేశారు. దక్షిణ యెమెన్ మరియు సౌదీ అరేబియా మధ్య భవిష్యత్ భాగస్వామ్యానికి ఆర్థిక మద్దతు మరియు అభివృద్ధి ఒక మూలస్తంభంగా ఉంటుందని, ప్రస్తుతం భద్రత, స్థిరత్వం మరియు అభివృద్ధి ఆధారంగా వ్యూహాత్మక భవిష్యత్తుకు నిజమైన ప్రారంభంగా పేర్కొన్నారు. భవిష్యత్ లోనూ సౌదీ అరేబియా కీలక భాగస్వామిగా కొనసాగుతుందని వెల్లడించారు.
హౌతీలు మరియు ఇతర తీవ్రవాద గ్రూపులను దక్షిణ యెమెన్ ఎదుర్కొంటున్న ప్రాథమిక ముప్పుగా పేర్కొన్నారు. దక్షిణ యెమెన్ ప్రజల ఆకాంక్షలకు మద్దతు ఇవ్వాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.
తాజా వార్తలు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!









