అసోం, బిహార్ రాష్ట్రాలలో వరదల బీభత్సం
- August 14, 2017
అసోం, బిహార్ రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. అసోంలోని 33 జిల్లాల్లో 21 జిల్లాలపై వరద ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఆదివారం ఒక్కరోజు సుమారు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రహ్మపుత్ర నది అనేకచోట్ల ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తుండటంతో సహాయచర్యల్లో పాల్గొనేందుకు సైన్యం రంగంలోకి దిగింది. వరద ప్రభావ ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం అసోం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్తో ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వరదల కారణంగా దూరప్రాంత రైళ్లలన్నింటినీ రద్దు చేశారు.
బిహార్లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో 12 జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. లక్షలాది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ట్రాక్లు, రహదారులు నీట మునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోసహాయకచర్యలు చేపట్టేందుకు 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్రానికి చేరుకున్నాయి.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









