సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం షురూ

- August 14, 2017 , by Maagulf
సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం షురూ

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు 25వ చిత్రం ప్రారంభమైంది. ఈరోజు కృష్ణాష్టమిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్‌, దిల్‌రాజు, మహేశ్‌ సతీమణి నమ్రత శిరోద్కర్‌, పిల్లలు గౌతమ్‌, సితార పాల్గొన్నారు.
ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారు. అశ్విని దత్‌, దిల్‌రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. అశ్విని దత్‌ నిర్మాతగా వ్యవహరించిన 'రాజకుమారుడు' చిత్రంతో మహేశ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం మహేశ్‌ ఏ.ఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో 'స్పైడర్‌', కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్‌ అనే నేను' చిత్రాలతో బిజీగా ఉన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com