పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినాఫాసోలో ఉగ్రదాడి.. 17 మంది మృతి
- August 14, 2017
8మందికి గాయాలు
పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. బుర్కినా ఫాసో రాజధాని వాగాదువోలో ఉన్న టర్కీస్ రెస్టారెంట్లోకి స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం 9 గంటల సమయంలో దుండగులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతిచెందగా... మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో వివిధ దేశాలకు చెందినవారు ఉన్నారని ఆఫ్రికన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఈ దాడి కారణంగా వాగాదుగో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదని పోలీసులు వెల్లడించారు.
బుర్కినాఫాసోలో గత రెండేళ్ల కాలంలో ఉగ్రదాడి జరగడం ఇది రెండోసారి. గతేడాది జనవరిలో ఓ కేఫ్పై దాడి చేసిన ఉగ్రవాదులు 30 మందిని పొట్టపెట్టుకున్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







