డ్రగ్స్ ఇష్యూపై పాట పాడి అందరిని కదిలించిన రఘు

- August 15, 2017 , by Maagulf
డ్రగ్స్ ఇష్యూపై పాట పాడి అందరిని కదిలించిన రఘు

కళ్ల ముందే కన్న బిడ్డలు రాలిపోతుంటే... డ్రగ్స్ మహమ్మారి మత్తులో పసివాళ్లు తమ జీవితాలను కోల్పోతుంటే... గుండె బరువెక్కి చేసిన చిన్న ప్రయత్నం ఇది... యువతను రక్షిద్దాం, వారి భవిష్యత్తును కాపాడుదాం.... అంటూ తాజాగా విడుదలైన ఓ వీడియో సాంగ్ ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది.
ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. స్కూలు పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదిలింది. పలువురు సినీ స్టార్ల పేర్లు సైతం ఈ వ్యవహారంలో ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో డ్రగ్స్ మహమ్మారిన నుండి యువతను కాపాడుదాం, సేవ్ యంగ్ ఇండియా అంటూ... మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె, డైరెక్టర్ సంజీవ్ రెడ్డి ఈ మ్యూజిక్ ఆల్బమ్ తయారు చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా దీన్ని రిలీజ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com