స్వాతంత్ర్య వేడుకల్లో ప్రసంగిస్తుండగా ఒడిశా సీఎంకు అస్వస్థత
- August 15, 2017
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. భువనేశ్వర్లో స్వాతంత్య్రదినోత్సవ వేడుకులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం సీఎం నివాసానికి తరలించారు. అక్కడ ఇద్దరు వైద్యులు ఆయనకి చికిత్స అందించారు.
ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. నవీన్ పట్నాయక్... ఈరోజు షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని సీఎం కార్యాలయ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









