ఇద్దరు సినీ నటులను 2019 ఎన్నికల బరిలో దింపనున్న బీజేపీ
- August 15, 2017
కేంద్రంలో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ.. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పట్టుసాధించాలని భావిస్తున్నది. ఈ నేపద్యంలో సినీ గ్లామర్ కు వలవేసే ప్రయత్నాలను ఇప్పటి నుంచే మొదలు పెట్టింది. 2019 లో జరగబోయే ఎన్నికల్లో సినీ గ్లామర్ కోసం తమ పావులను కదుపుతున్నది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఇద్దరు సినీ ప్రముఖులను ఎన్నికల బరిలో నిలిపే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నటి, బుల్లి తెర ఫ్యామిలీ షోకి వ్యాఖ్యాతగా చేసిన జీవితా రాజశేఖర్ తో పాటు.. ప్రముఖ నటుడు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా కు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి టికెట్లు ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరికి నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ టికెట్స్ దక్కడం ఖాయం. కాగా ఏ నియోజక వర్గం నుంచి అనేది మాత్రం తెలియాల్సి ఉన్నది. శివాజీ రాజా తాను వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. అంతేకాదు. బీజేపీ లో మరికొంతమంది ప్రముఖులను చేర్చుకొనేలా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







