హజ్ యాత్రలో భాగంగా సౌదీ అరేబియాకు చేరుకొన్న104 ఏళ్ల బామ్మగారు
- August 17, 2017
సౌదీ అరేబియా : అరవై ఏళ్ళు వయస్సుకే..అప్పగింతలు పెట్టే అమ్మమ్మలు అడుగడుగునా ఉన్న ఈ కాలంలో ఇండోనేషియా నుండి ఏకంగా 104 ఏళ్ల బామ్మగారు హజ్ యాత్రకు చెంగు చెంగున ప్రయాణమై జెడ్డాకు చేరుకొన్నారు. ఈ సంవత్సరం ఇండోనేషియా నుంచి వచ్చిన 220,000 హజ్ యాత్రికుల్లో అందరికన్నా పెద్ద వయస్సు ఉన్న బాయిక్ మారియా అనే వృద్ధురాలు కావడం విశేషం. జెడ్డా లోని ఇండోనేషియా రాయబార కార్యాలయ కాన్సుల్ జనరల్ మొహమ్మద్ హెరి సరిపుద్దిన్ మాట్లాడుతూ, బాయిక్ మరియా మంచి ఆరోగ్యంతో ఉందని మరియు హజ్ ఆచారాలను ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి చేయగలనని ఆమె సంతోషంగా తెలిపిందన్నారు..ఆమె ఇండోనేషియా నుండి వచ్చేటప్పుడు ఆమెకు తోడుగా ప్రత్యేక సహాయం అందించారు. కొందరు అధికారులు ఆమె సురక్షితమైన మరియు మృదువైన విమాన ప్రయాణం జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారు. అలాగే ఆమె కోసం సౌదీ అరేబియాలో స్థానిక అధికారులచే ప్రత్యేక సహాయంతో మరియాకు అందించారు. ఇండోనేషియాలో హజ్ ను నిర్వహించడానికి లక్షలాదిమంది ముస్లింలు ఎదురుచూసేరని మొహమ్మద్ హెరి సరిపుద్దిన్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







