మెట్రోరైలు కు అనుగుణంగా సిటీ బస్సులు
- August 18, 2017
నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం అవుతున్న మెట్రోకు అనుగుణంగా సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఏర్పాట్లు చేస్తోంది. రైలు దిగిన వెంటనే ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేసేందుకు బస్సులు అందుబాటులో ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రోస్టేషన్ల వద్దే బస్టాపులు నెలకొల్పుతున్నట్టు చెప్పారు. ఈ ఏడాది నవంబర్లోగా మియాపూర్, నాగోల్ కారిడార్లు పూర్తవుతాయని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా సిటీ బస్సులను సమకూర్చుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మియాపూర్ నుంచి అమీర్పేట, నాగోల్ నుంచి అమీర్పేట రూట్లలో అదనపు బస్సులను నడపనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే ఎల్బీనగర్ నుంచి వివిధ ప్రాంతాలకు 760, మియాపూర్ నుంచి 940 సిటీ బస్సులు నడుపుతున్న టీఎ్సఆర్టీసీ మెట్రో అందుబాటులోకి వచ్చేలోపు మరిన్ని బస్సులను సమకూర్చుకునే పనిలో పడింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









