ఫేస్బుక్, ట్విట్టర్ తో సందడి చేస్తున్న హీరో ప్రభాస్
- August 18, 2017
బాహుబలి సినిమాతో ప్రపంచానికి తెలిసిపోయాడు టాలీవుడ్ హీరో ప్రభాస్. భారీ హిట్ సాధించి తెలుగోడి సత్తా చాటిన ఈహీరో తాజాగా నటిస్తున్న చిత్రం 'సాహో'. చిత్ర షూటింగ్ ఇదివరకే ప్రారంభమైనప్పటికీ.. షూటింగ్లో ఈరోజు(శుక్రవారం)నుండి హీరో ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా తన పేస్బుక్ ద్వారా అందరికీ తెలియజేశాడు. 'ఇట్స్ షూట్ టైమ్.. దాదాపుగా నాలుగున్నరేళ్ల సుదీర్ఘ బాహుబలి ప్రయాణం తర్వాత ఓ యాక్షన్ ప్రపంచం 'సాహో' లోకి ప్రవేశించడం చాలా ఉత్సాహాన్నిస్తోంది' అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం సోషల్మీడియాలో ఈ పోస్ట్ ప్రభాస్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.
యూవీ క్రియేషన్స్ పతాకంపై సుజీత్ దర్శకత్వంలో భారీబడ్జెట్తో 'సాహో' సినిమా తెరకెక్కుతోంది. చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దాకపూర్ ని హీరోయిన్గా తీసుకున్నారు. ఈసినిమాలో ప్రభాస్ ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా స్టైలిష్లుక్లో దర్శనమీయనున్నాడని తెలిసింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







