ఫేస్బుక్, ట్విట్టర్ తో సందడి చేస్తున్న హీరో ప్రభాస్
- August 18, 2017
బాహుబలి సినిమాతో ప్రపంచానికి తెలిసిపోయాడు టాలీవుడ్ హీరో ప్రభాస్. భారీ హిట్ సాధించి తెలుగోడి సత్తా చాటిన ఈహీరో తాజాగా నటిస్తున్న చిత్రం 'సాహో'. చిత్ర షూటింగ్ ఇదివరకే ప్రారంభమైనప్పటికీ.. షూటింగ్లో ఈరోజు(శుక్రవారం)నుండి హీరో ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా తన పేస్బుక్ ద్వారా అందరికీ తెలియజేశాడు. 'ఇట్స్ షూట్ టైమ్.. దాదాపుగా నాలుగున్నరేళ్ల సుదీర్ఘ బాహుబలి ప్రయాణం తర్వాత ఓ యాక్షన్ ప్రపంచం 'సాహో' లోకి ప్రవేశించడం చాలా ఉత్సాహాన్నిస్తోంది' అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం సోషల్మీడియాలో ఈ పోస్ట్ ప్రభాస్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.
యూవీ క్రియేషన్స్ పతాకంపై సుజీత్ దర్శకత్వంలో భారీబడ్జెట్తో 'సాహో' సినిమా తెరకెక్కుతోంది. చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దాకపూర్ ని హీరోయిన్గా తీసుకున్నారు. ఈసినిమాలో ప్రభాస్ ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా స్టైలిష్లుక్లో దర్శనమీయనున్నాడని తెలిసింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









