జీతాల కోసం కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ కార్మికుల ఆందోళన

- August 18, 2017 , by Maagulf
జీతాల కోసం కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ కార్మికుల ఆందోళన

మనామా: ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి చెందిన 50 మందికి పైగా కార్మికులు అండలుస్‌ గార్డెన్‌ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్‌ వేతనాల్ని చెల్లించాల్సిందిగా వారంతా డిమాండ్‌ చేశారు. కంపెనీలో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారనీ, గత ఏడాది నవంబర్‌ నుంచి జీతాలు చెల్లించడంలేదని ఆరోపిస్తున్నారు ఆందోళన చేసిన కార్మికులు. వారిలో ఒక కార్మికుడు జగన్‌ మాట్లాడుతూ, బకాయిల్ని చెల్లించేసినట్లుగా మినిస్ట్రీకి కంపెనీ తప్పుడు సమాచారం ఇచ్చిందని అన్నారు. కొంతమందికి మాత్రమే వేతనాలు చెల్లించాలనీ, 30 మంది బహ్రెయినీ ఉద్యోగులకు మాత్రమే చెల్లింపులు జరిగాయనీ, వలసదారులమైన తామెవరికీ జీతాలు, బకాయిలూ కంపెనీ చెల్లించలేదని ఆయన ఆరోపించడం జరిగింది. కంపెనీకి పెద్ద కాంట్రాక్టులు రావడంతో 2016లో కార్మికుల్ని నియమించుకుంది. సప్లయర్స్‌ నుంచి పేమెంట్స్‌ లేకపోవడం, ప్రాజెక్టుల డిలే కావడంతో కంపెనీ నష్టాలపాలయ్యింది. కంపెనీ స్పందించకపోవడంతో తమ భవిష్యత్తు అంధకారమైపోయిందని జగన్‌ వాపోయారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com