జీతాల కోసం కన్స్ట్రక్షన్ కంపెనీ కార్మికుల ఆందోళన
- August 18, 2017
మనామా: ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన 50 మందికి పైగా కార్మికులు అండలుస్ గార్డెన్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్ వేతనాల్ని చెల్లించాల్సిందిగా వారంతా డిమాండ్ చేశారు. కంపెనీలో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారనీ, గత ఏడాది నవంబర్ నుంచి జీతాలు చెల్లించడంలేదని ఆరోపిస్తున్నారు ఆందోళన చేసిన కార్మికులు. వారిలో ఒక కార్మికుడు జగన్ మాట్లాడుతూ, బకాయిల్ని చెల్లించేసినట్లుగా మినిస్ట్రీకి కంపెనీ తప్పుడు సమాచారం ఇచ్చిందని అన్నారు. కొంతమందికి మాత్రమే వేతనాలు చెల్లించాలనీ, 30 మంది బహ్రెయినీ ఉద్యోగులకు మాత్రమే చెల్లింపులు జరిగాయనీ, వలసదారులమైన తామెవరికీ జీతాలు, బకాయిలూ కంపెనీ చెల్లించలేదని ఆయన ఆరోపించడం జరిగింది. కంపెనీకి పెద్ద కాంట్రాక్టులు రావడంతో 2016లో కార్మికుల్ని నియమించుకుంది. సప్లయర్స్ నుంచి పేమెంట్స్ లేకపోవడం, ప్రాజెక్టుల డిలే కావడంతో కంపెనీ నష్టాలపాలయ్యింది. కంపెనీ స్పందించకపోవడంతో తమ భవిష్యత్తు అంధకారమైపోయిందని జగన్ వాపోయారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







