600 మంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు
- August 18, 2017హమాద్ మెడికల్ కార్పొరేషన్, నేషనల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్ (ఎన్సిసిఆర్) వద్ద కొత్త బ్రెస్ట్ కేర్ క్నిఇక్ని ఏర్పాటు చేసింది. ఈ క్లినిక్ ఏర్పాటయినప్పటినుంచి ఇప్పటిదాకా 600 మందికి పైగా మహిళలకు పరీక్షల్ని నిర్వహించారు. ట్రిపుల్ ఎస్సెస్మెంట్ టెస్ట్ ద్వారా ఈ పరీక్షల్ని సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ ఇమేజింగ్, కోర్ బయాప్సీ వంటివి ఇందులో భాగం. ట్రిపుల్ ఎస్సెస్మెంట్ విధానం ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో క్యాన్సన్ని ముందుగానే గుర్తించగలమనీ తద్వారా చికిత్స తేలికవుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. క్లినిక్ని మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ హనామ్ మొహమ్మద్ అల్ కువారి ప్రారంభించారు. ఖతార్లో బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లో సర్వసాధారణంగా మారిపోయిందని, ప్రపంచ వ్యాప్తంగానూ మోస్ట్ కామన్ క్యాన్సర్స్లో రెండోదిగా గుర్తింపు పొందిందని వైద్యులు వెల్లడించారు. అయితే సకాలంలో గుర్తిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ని సమర్థవంతంగా అడ్డుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..