రాగి పాత్రలే సురక్షితం అంటున్న నిపుణులు

- August 20, 2017 , by Maagulf
రాగి పాత్రలే సురక్షితం అంటున్న నిపుణులు

మనం ఇప్పుడు నాన్‌స్టిక్ వస్తువులు... అవీఇవీ అంటూ అలాంటి పాత్రలు కొని వాటిలో వండేస్తుంటారు. కానీ వాటితో చాలా డేంజర్ గురూ అంటున్నారు వైద్య నిపుణులు. పూర్వం కాలంలో ఇత్తడిని ఉపయోగించేవారు, మట్టి పాత్రలను ఉపయోగించేవారు. ఆ తర్వాత అల్యూమినియం పాత్రలు రంగంలోకి వచ్చాయి. అవి చాలా డేంజర్ అని చెప్పడంతో వాటిని వాడటం మానేశారు. 
 
ఆ పాత్రలు వాడేవారు అవి ఎంత డేంజరో తెలుసుకోవాలంటే వాటిలో గోంగూరను ఉడికించి చూస్తే తెలుస్తుంది. ఆ లోహంతో గోంగూరలో వుంటే ఆమ్ల గుణం కలిసి పాత్ర అంతా బుడిపెలుగా అగుపిస్తుంది. అందువల్ల అల్యూమినియం పాత్రలు అపాయమని తేల్చారు. మరి సురక్షితమైన పాత్రలు ఏమిటి అని చూస్తే రాగి పాత్రలు అని చెపుతున్నారు. 
 
ఈ పాత్రల వల్ల ఆరోగ్యానికి కలిగే ముప్పు అంతగా వుండదు. అలాగే ఇనుముతో చేసిన పాన్లు కూడా ఫర్వాలేదు. కానీ ఇత్తడి, అల్యూమినియం పాత్రలు మాత్రం వాడకపోవడమే మంచిది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com