ట్రిపుల్ తలాఖ్ ఆరు నెలలు నిషేధం సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- August 21, 2017
ట్రిపుల్ తలాఖ్పై ఆరు నెలలు నిషేధం
ఈ ఆరు నెలల్లో చట్టం తీసుకురావాలి
కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు
ముస్లిం సామాజికవర్గంలో అమల్లో ఉన్న వివాదాస్పద విడాకుల విధానం ట్రిపుల్ తలాఖ్పై సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పును వెలువరించింది. ట్రిపుల్ తలాఖ్ రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో తీర్పు వెలువరించింది. ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులకు ట్రిపుల్ తలాఖ్ భంగం కలిగిస్తున్నదని, రాజీకి ఏమాత్రం అవకావం ఇవ్వకుండా ఏకంగా వివాహాన్ని రద్దు చేయడం ఎంతమాత్రం సమ్మతం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ విధానంపై ఆరు నెలల్లోపు పార్లమెంటులో చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆరు నెల కాలంలో ట్రిపుల్ తలాఖ్ విధానాన్ని అనుసరించకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఆరు నెలల్లో చట్టాన్ని తీసుకురాకపోతే.. ట్రిపుల్ తలాఖ్ను కొనసాగించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో రాజకీయాలను పక్కనబెట్టి అన్ని పార్టీలు చట్టం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించింది. రాజ్యాంగ ధర్మాసనంలోని ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్, మరో న్యాయమూర్తి ఎస్ అబ్దుల్ నజీర్ ట్రిపుల్ తలాఖ్ను సమర్థించగా.. ఇతర న్యాయమూర్తులైన జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ కురియన్ జోసెఫ్ వారి తీర్పుతో విభేదించారు. ఈ ముగ్గురు న్యాయమూర్తులు ట్రిపుల్ తలాఖ్ రాజ్యాంగ విరుద్ధమంటూ మెజారిటీ తీర్పు వెలువరించారు. కాగా, ఇస్లాంలో భాగమైన సున్నీ వర్గం ప్రజలు గత వెయ్యేళ్లుగా ట్రిపుల్ తలాఖ్ విధానాన్ని అనుసరిస్తున్నారని జస్టిస్ జేఎస్ ఖేహర్ అన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







