బ్రిటన్లో నాలుగు శాతం తగ్గిన భారతీయ వీసాలు
- August 24, 2017బ్రిటన్లో నైపుణ్య ఉద్యోగవీసాల కోసం భారతీయుల దరఖాస్తుల సంఖ్య నాలుగు శాతం పడిపోయిందని అక్కడి హోం కార్యాలయం పేర్కొంది. 2017 జూన్ ముగిసే నాటికి 29,800 భారతీయులు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. వలసల నియంత్రణ కోసం వీసాల జారీలో బ్రిటన్ ప్రభుత్వం నిబంధనలను కఠినంగా మార్చిన విషయం తెలిసిందే. 5,686 దరఖాస్తులతో అమెరికా భారత్ తర్వాతి స్థానంలో నిలిచిందని వెల్లడించింది. ఈ వీసాల సహాయంతో విదేశీయులు అక్కడే నివసిస్తూ ఉద్యోగం చేసుకోవచ్చు.
బ్రిటన్లోని జాతీయ గణాంకాల వివరాల ప్రకారం బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన మొత్తం 92,805 ఉద్యోగ వీసాల్లో 53,366 వీసాలు భారతీయులకే మంజూరు చేసింది. అందులో 42 శాతం వీసాలు ఐటీ రంగంలోనే అందించారు.
తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం బ్రెక్సిట్ తరవాత ఐరోపా దేశాల నుంచి బ్రిటన్కు వలసలు తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది. మరోవైపు వీసా దరఖాస్తుల పతనంతో ఉద్యోగాలకు సరైన వ్యక్తులను ఎంపిక చేయడానికి స్థానిక సంస్థలకు కష్టంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు