బ్రిటన్లో నాలుగు శాతం తగ్గిన భారతీయ వీసాలు
- August 24, 2017
బ్రిటన్లో నైపుణ్య ఉద్యోగవీసాల కోసం భారతీయుల దరఖాస్తుల సంఖ్య నాలుగు శాతం పడిపోయిందని అక్కడి హోం కార్యాలయం పేర్కొంది. 2017 జూన్ ముగిసే నాటికి 29,800 భారతీయులు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. వలసల నియంత్రణ కోసం వీసాల జారీలో బ్రిటన్ ప్రభుత్వం నిబంధనలను కఠినంగా మార్చిన విషయం తెలిసిందే. 5,686 దరఖాస్తులతో అమెరికా భారత్ తర్వాతి స్థానంలో నిలిచిందని వెల్లడించింది. ఈ వీసాల సహాయంతో విదేశీయులు అక్కడే నివసిస్తూ ఉద్యోగం చేసుకోవచ్చు.
బ్రిటన్లోని జాతీయ గణాంకాల వివరాల ప్రకారం బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన మొత్తం 92,805 ఉద్యోగ వీసాల్లో 53,366 వీసాలు భారతీయులకే మంజూరు చేసింది. అందులో 42 శాతం వీసాలు ఐటీ రంగంలోనే అందించారు.
తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం బ్రెక్సిట్ తరవాత ఐరోపా దేశాల నుంచి బ్రిటన్కు వలసలు తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది. మరోవైపు వీసా దరఖాస్తుల పతనంతో ఉద్యోగాలకు సరైన వ్యక్తులను ఎంపిక చేయడానికి స్థానిక సంస్థలకు కష్టంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









