బ్రిటన్లో నాలుగు శాతం తగ్గిన భారతీయ వీసాలు
- August 24, 2017
బ్రిటన్లో నైపుణ్య ఉద్యోగవీసాల కోసం భారతీయుల దరఖాస్తుల సంఖ్య నాలుగు శాతం పడిపోయిందని అక్కడి హోం కార్యాలయం పేర్కొంది. 2017 జూన్ ముగిసే నాటికి 29,800 భారతీయులు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. వలసల నియంత్రణ కోసం వీసాల జారీలో బ్రిటన్ ప్రభుత్వం నిబంధనలను కఠినంగా మార్చిన విషయం తెలిసిందే. 5,686 దరఖాస్తులతో అమెరికా భారత్ తర్వాతి స్థానంలో నిలిచిందని వెల్లడించింది. ఈ వీసాల సహాయంతో విదేశీయులు అక్కడే నివసిస్తూ ఉద్యోగం చేసుకోవచ్చు.
బ్రిటన్లోని జాతీయ గణాంకాల వివరాల ప్రకారం బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన మొత్తం 92,805 ఉద్యోగ వీసాల్లో 53,366 వీసాలు భారతీయులకే మంజూరు చేసింది. అందులో 42 శాతం వీసాలు ఐటీ రంగంలోనే అందించారు.
తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం బ్రెక్సిట్ తరవాత ఐరోపా దేశాల నుంచి బ్రిటన్కు వలసలు తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది. మరోవైపు వీసా దరఖాస్తుల పతనంతో ఉద్యోగాలకు సరైన వ్యక్తులను ఎంపిక చేయడానికి స్థానిక సంస్థలకు కష్టంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







