మయన్మార్లో ఘోరం
- August 25, 2017
యాన్గాన్: మయన్మార్లోని రఖినీ రాష్ట్రంలో తీవ్రవాదులు భయోత్పాతం సృష్టించారు. దాదాపు 30 పోలీస్ పోస్టులు, ఆర్మీ బేస్ క్యాంప్లపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 71 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇందులో 12 మంది భద్రతా విభాగానికి చెందిన అధికారులు కూడా ఉన్నారు. వందలమంది గాయాలపాలయ్యారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ దాడికి తామే కారణమంటూ అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఏఆర్ఎస్ఏ) అనే తీవ్రవాద సంస్థ ప్రకటించింది. దీనిని ఇంతకు ముందు హరఖా అల్ యాక్విన్ అని పిలిచే వారు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక బంగ్లా సరిహద్దులోని మాంటగావ్ పోలీస్స్టేషన్ను పేల్చివేశారని, అదే సమయంలో రఖినీలోని వివిధ పోలీస్స్టేషన్లపై దాడులకు పాల్పడ్డారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో దాదాపు 200 మంది తీవ్రవాదులు పాల్గొని ఉంటారని అంచనా వేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్లో మయన్మార్లో జరిగిన విధ్వంసకాండకూ ఈ తీవ్రవాద సంస్థే కారణం.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









