మయన్మార్లో ఘోరం
- August 25, 2017
యాన్గాన్: మయన్మార్లోని రఖినీ రాష్ట్రంలో తీవ్రవాదులు భయోత్పాతం సృష్టించారు. దాదాపు 30 పోలీస్ పోస్టులు, ఆర్మీ బేస్ క్యాంప్లపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 71 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇందులో 12 మంది భద్రతా విభాగానికి చెందిన అధికారులు కూడా ఉన్నారు. వందలమంది గాయాలపాలయ్యారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ దాడికి తామే కారణమంటూ అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఏఆర్ఎస్ఏ) అనే తీవ్రవాద సంస్థ ప్రకటించింది. దీనిని ఇంతకు ముందు హరఖా అల్ యాక్విన్ అని పిలిచే వారు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక బంగ్లా సరిహద్దులోని మాంటగావ్ పోలీస్స్టేషన్ను పేల్చివేశారని, అదే సమయంలో రఖినీలోని వివిధ పోలీస్స్టేషన్లపై దాడులకు పాల్పడ్డారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో దాదాపు 200 మంది తీవ్రవాదులు పాల్గొని ఉంటారని అంచనా వేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్లో మయన్మార్లో జరిగిన విధ్వంసకాండకూ ఈ తీవ్రవాద సంస్థే కారణం.
తాజా వార్తలు
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!







