మయన్మార్లో ఘోరం
- August 25, 2017
యాన్గాన్: మయన్మార్లోని రఖినీ రాష్ట్రంలో తీవ్రవాదులు భయోత్పాతం సృష్టించారు. దాదాపు 30 పోలీస్ పోస్టులు, ఆర్మీ బేస్ క్యాంప్లపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 71 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇందులో 12 మంది భద్రతా విభాగానికి చెందిన అధికారులు కూడా ఉన్నారు. వందలమంది గాయాలపాలయ్యారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ దాడికి తామే కారణమంటూ అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఏఆర్ఎస్ఏ) అనే తీవ్రవాద సంస్థ ప్రకటించింది. దీనిని ఇంతకు ముందు హరఖా అల్ యాక్విన్ అని పిలిచే వారు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక బంగ్లా సరిహద్దులోని మాంటగావ్ పోలీస్స్టేషన్ను పేల్చివేశారని, అదే సమయంలో రఖినీలోని వివిధ పోలీస్స్టేషన్లపై దాడులకు పాల్పడ్డారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో దాదాపు 200 మంది తీవ్రవాదులు పాల్గొని ఉంటారని అంచనా వేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్లో మయన్మార్లో జరిగిన విధ్వంసకాండకూ ఈ తీవ్రవాద సంస్థే కారణం.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









