భారతీయ నగరాల్లో ఉండే యూఏఈ పౌరులకు హెచ్చరిక
- August 28, 2017
న్యూఢిల్లీ: న్యూ ఢిల్లీలోని యుఎఇ దౌత్యకార్యాలయం భారతదేశంలో ఉండే ఎమిరాటీ పౌరులకు సలహా ఇచ్చింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రద్దీగా ఉన్న ప్రాంతాల నుంచి తమ దేశ పౌరులు దూరంగా ఉండాలని కోరింది. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం డేరా బాబా అరెస్ట్ తర్వాత జరిగిన హింసాకాండలో కనీసం 36 మంది మరణించారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగదీప్ సింగ్ ఈ కేసులో తన తీర్పుని ఇస్తూ డేరా ముఖ్యఅధిపతి గుర్మీత్ రామ్ రహీం సింగ్ 2002 లో ఇద్దరు మహిళా శిష్యులను అత్యాచారం చేసి లైంగికంగా దోపిడీకి పాల్పడిన కేసులో నిందితుడు. ఈ వ్యక్తికి వందలాదిమంది అనుచరులు ఉన్నారు. వీరిలో 36 మంది బాధితులు, పంచకులలో 30 మంది మరణించారు,సిర్సా పట్టణంలో ఆరుగురు మరణించారు. ఇప్పటివరకు ఈ హింసాకాండలో దాదాపు 250 మందికి పైగా గాయపడ్డారు. జాతీయ రాజధానిలోని 11 నుంచి 13 పోలీసు జిల్లాల్లో హింసాసకాండను అణిచివేసేందుకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నేషనల్ న్యూస్ చానెల్ నుండి ఆ ప్రాంతానికి వచ్చిన మీడియా బృందంపై సైతం దేరా సచ సౌద యొక్క అనుచరులు దాడి చేశారు..
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







