భారతీయ నగరాల్లో ఉండే యూఏఈ పౌరులకు హెచ్చరిక
- August 28, 2017
న్యూఢిల్లీ: న్యూ ఢిల్లీలోని యుఎఇ దౌత్యకార్యాలయం భారతదేశంలో ఉండే ఎమిరాటీ పౌరులకు సలహా ఇచ్చింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రద్దీగా ఉన్న ప్రాంతాల నుంచి తమ దేశ పౌరులు దూరంగా ఉండాలని కోరింది. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం డేరా బాబా అరెస్ట్ తర్వాత జరిగిన హింసాకాండలో కనీసం 36 మంది మరణించారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగదీప్ సింగ్ ఈ కేసులో తన తీర్పుని ఇస్తూ డేరా ముఖ్యఅధిపతి గుర్మీత్ రామ్ రహీం సింగ్ 2002 లో ఇద్దరు మహిళా శిష్యులను అత్యాచారం చేసి లైంగికంగా దోపిడీకి పాల్పడిన కేసులో నిందితుడు. ఈ వ్యక్తికి వందలాదిమంది అనుచరులు ఉన్నారు. వీరిలో 36 మంది బాధితులు, పంచకులలో 30 మంది మరణించారు,సిర్సా పట్టణంలో ఆరుగురు మరణించారు. ఇప్పటివరకు ఈ హింసాకాండలో దాదాపు 250 మందికి పైగా గాయపడ్డారు. జాతీయ రాజధానిలోని 11 నుంచి 13 పోలీసు జిల్లాల్లో హింసాసకాండను అణిచివేసేందుకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నేషనల్ న్యూస్ చానెల్ నుండి ఆ ప్రాంతానికి వచ్చిన మీడియా బృందంపై సైతం దేరా సచ సౌద యొక్క అనుచరులు దాడి చేశారు..
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









