ఈ టైర్ల కంపెనీకి తొలి అంబాసిడర్‌ పీవీ సింధు

- August 30, 2017 , by Maagulf
ఈ టైర్ల కంపెనీకి తొలి అంబాసిడర్‌ పీవీ సింధు

ప్రపంచంలోనే అతి పెద్ద టైర్ల తయారీ కంపెనీ బ్రిడ్జ్‌స్టోన్‌.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో బ్రాండ్ అండార్స్‌మెంట్ కుదుర్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ భాగస్వామిగా ఉన్న బ్రిడ్జ్‌స్టోన్.. రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న పీవీ సింధును ప్రచారకర్తగా ఎంచుకుంది. భారత్‌లో ఈ టైర్ల కంపెనీకి తొలి అంబాసిడర్‌ పీవీ సింధు కావడం విశేషం. వ్యాపార కార్యకలాపాలతో పాటు.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒలింపిక్ విలువను పెంచే ఈవెంట్స్‌లోనూ తాను పాల్గొంటానని.. పీవీ సింధు తెలిపింది. నిలకడ.. పని తీరు.. అంకితభావం.. తనకు మాదిరిగానే ఈ కంపెనీలో కూడా ఉంటాయని.. అందుకే ప్రచారం చేయబోతున్నానని చెబుతోంది పీవీ సింధు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com