భారత దేశవ్యాప్తంగా 'ఇ-సహయోగ్', 'పాన్ క్యాంప్స్'
- October 27, 2015
ఆదాయపు పన్ను శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇ-సహయోగ్', 'పాన్ క్యాంప్స్' కార్యక్రమాలను మంగళవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించనున్నారు. పన్ను చెల్లింపుదారులతో ఇ-మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపే 'ఇ-సహయోగ్' సేవలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ సేవలను తాత్కాలికంగా పరీక్షించగా, ఇకపై పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. మరింత మందిని శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) పరిధిలోకి తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా పాన్ క్యాంపులను నిర్వహించాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 23 కోట్ల మంది మాత్రమే శాశ్వత ఖాతా సంఖ్యను కలిగి ఉన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది పాన్ పరిధిలోకి వస్తే బడ్జెట్లో ప్రతిపాదించినట్లు రూ.లక్షపై కొనుగోలు, అమ్మకాలకు పాన్ సంఖ్యను తప్పనిసరి చేసే వెసులు బాటు ప్రభుత్వానికి లభిస్తుంది. దీంతో పాన్ క్యాంప్స్ను మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









