జమ్మూ కశ్మీర్ డీఐజీని కదిలించిన జోరా హృదయ వేదన
- August 30, 2017
చిన్న బిడ్డ నిబ్బరంగా ఎలా ఉండగలదు... నాన్న ఒడిలో ఆడుకునే పసిబిడ్డ నాన్న లేకపోతే ఎలా ఉండగలదు..అమ్మ అన్నం పెడుతుంది.. నాన్న ఆడిస్తాడు.. నాన్న లేని తన ప్రపంచాన్ని ఊహించుకుని భోరున విలపించిందా చిట్టి తల్లి... ఆ బంగారు తల్లిని చూస్తే గుండె బరువెక్కిపోతుంది.. తండ్రి దేశం కోసం ప్రాణాలర్పించాడు...బిడ్డను అనాధను చేశాడు. తన నాన్నలేడని, ఇక రాడని శ్రీనగర్ ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అబ్దుల్ రషీద్ కుమార్తె జోరా రోదన ఆ తండ్రికి వినిపించే ఉంటుంది.
జోరా హృదయ వేదన జమ్మూ కశ్మీర్ డీఐజీని కదిలించింది. నువ్వు అంతగా ఏడుస్తుంటే నా గుండె పిండేసినట్లుంది తల్లీ అంటూ తన బాధను ఫేస్బుక్ ద్వారా జోరాకి తెలియజేశారు. ఏం జరిగిందో తెలుసుకునే వయసు కూడా జోరాకి లేదు. తనని ఎలా ఓదార్చాలో కూడా తెలియట్లేదు అని డీఐజ్ అన్నారు. ఎందరో పోలీసులు కుటుంబానికి, కన్నబిడ్డలకు దూరమై దేశం కోసం ప్రాణాలర్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఇలాంటి విషయాలే మమ్మల్ని చరిత్రలో గుర్తుండిపోయేలా చేస్తాయని, ఖాకీ దుస్తులు వేసుకున్నప్పుడు దేశానికి చేసిన ప్రతిజ్ఞ మమ్మల్ని వెనకడుగు వేయనీయదని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









