ఐదు క్యాంప్ల ఏర్పాటు: ఇండియన్ ఎంబసీ
- September 01, 2017
కాన్సులర్ సేవల్ని అత్యవసరంగా అందించేందుకోసం ఖతార్లో ఇండియన్ ఎంబసీ భారతీయ వలసదారులకు ఉపయోగకరంగా ఉండేందుకు ఐదు క్యాంప్లను ఆగస్ట్లో నిర్వహించింది. సల్వా, మెసైయీద్, అల్ ఖోర్, దుఖాన్, జిక్రీత్ తదితర ప్రాంతాల్లో వీటిని నిర్వహించినట్లు నెలవారీ నిర్వహించే కమ్యూనిటీ హౌస్ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మొత్తం 219 కాన్సులర్ సర్వీసుల్ని ఐదు క్యాంప్ల ద్వారా అందించినట్లు తెలిపారు అధికారులు. వలసదారులకు సంబంధించి పలు సమస్యలకు ఈ క్యాంప్లలో పరిష్కారం చూపగలిగినట్లు వారు వివరించారు. ఇంకో వైపున ఇండియన్ ఎంబసీ టీమ్, డిపోర్టేషన్ సెంటర్నీ, అలాగే సెంట్రల్ ప్రిజన్నీ సందర్శించింది. అక్కడి భారతీయ వలసదారుల సమస్యల్ని ఎంబసీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. జనవరి నుంచి 2017 మొత్తం 8 కమ్యూనిటీ హౌస్ సెషన్స్ నిర్వహించారు. మొత్తం 42 ఫిర్యాదులు ఈ సెషన్స్లో అందాయి. వీటిల్లో 28 ఫిర్యాదులకు పరిష్కారం దొరికింది. 14 ఫిర్యాదులు యాక్టివ్ ఫాలో అప్లో ఉన్నాయి. ఎంబసీ 43 ఎమర్జన్సీ సర్టిఫికెట్లను ఆగస్ట్లో జారీ చేసింది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







