ఇరాన్లో ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది బాలికల మృతి
- September 01, 2017
ఇరాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో11 మంది బాలికలు సహా 12 మంది మృత్యువాతపడ్డారు. ఇరాన్లోని షిరాజ్ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. షిరాజ్లో జరిగే క్రీడా, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి 45 మంది విద్యార్థినులు బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది అమ్మాయిలతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన బాలికలను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
కాగా ఇరాన్లో రహదారులు బాగున్నప్పటికీ.. ట్రాఫిక్ భద్రత విషయంలో పేలవమైన రికార్డు ఉంది. డ్రైవర్ల నిర్లక్ష్య కారణంగా ప్రతి ఏడాది వేలాదిమంది ప్రమాదానికి గురవుతున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!









