తిరుపతి చేరుకున్న భారత్ రాష్ట్రపతి
- September 01, 2017
రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుపతికి విచ్చేశారు. ఆయనకి రేణుగుంట విమానాశ్రయంలో ఏపీ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. గవర్నర్ నరసింహన్, సీఎం చంద్ర బాబు రాష్ట్రపతి స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, లోకేశ్, అమర్ నాథ్ రెడ్డి, కళా వెంకట్రావు, పితాని సత్యనారాయణ ఉన్నారు.
రేణిగుంట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి నేరుగా తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల ప్రాంగణంలో రూ.140 కోట్లతో నిర్మించిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు.
రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు తిరుపతిలోనే ఉండనున్నారు. రాష్ట్రపతితో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రపతి కోవింద్ రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









