తిరుపతి చేరుకున్న భారత్ రాష్ట్రపతి

- September 01, 2017 , by Maagulf
తిరుపతి చేరుకున్న భారత్ రాష్ట్రపతి

రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుపతికి విచ్చేశారు. ఆయనకి రేణుగుంట విమానాశ్రయంలో ఏపీ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. గవర్నర్ నరసింహన్, సీఎం చంద్ర బాబు రాష్ట్రపతి స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, లోకేశ్, అమర్ నాథ్ రెడ్డి, కళా వెంకట్రావు, పితాని సత్యనారాయణ ఉన్నారు.
రేణిగుంట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి నేరుగా తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల ప్రాంగణంలో రూ.140 కోట్లతో నిర్మించిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు.
రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు తిరుపతిలోనే ఉండనున్నారు. రాష్ట్రపతితో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రపతి కోవింద్ రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com