హరికేన్‌ బాధితులకు ట్రంప్‌ కోటి రూపాయల ఆర్ధిక సహాయం

- September 01, 2017 , by Maagulf
హరికేన్‌ బాధితులకు ట్రంప్‌ కోటి రూపాయల ఆర్ధిక సహాయం

జల విలయానికి టెక్సాస్‌ వణికిపోయింది.. ఇంకా అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.. అటు బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతుంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బాధితులకు మిలియన్‌ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు.
దీనిని భారీ విపత్తుగా పరిగణిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. వ్యక్తిగతంగా 6.4 కోట్ల రూపాయల విరాళాన్ని ఇవ్వనున్నారు. ఈ నిధులను వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు వినియోగిస్తారు. ఇక అమెరికా కాలమాన ప్రకారం శనివారం ట్రంప్‌ టెక్సాస్‌, లూసియానాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వాస్తవానికి మంగళవారమే టెక్సాస్‌కు వెళ్లినప్పటికీ వరద ఎక్కువగా ఉండటంతో అక్కడ పర్యటించలేకపోయారు. వరద బాధితులను పరామర్శించిన అనంతరం భారీ విరాళాన్ని ప్రకటించే అవకాశం కనబడుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com