వ్యాపిస్తున్న 'లాకీ ర్యాన్సమ్వేర్'..తస్మాత్ జాగ్రత్త..!
- September 02, 2017
కొత్తగా వ్యాపిస్తున్న మాల్వేర్ 'లాకీ ర్యాన్సమ్వేర్'తో జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. లాకీ ర్యాన్సమ్వేర్పై జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అదనపు కార్యదర్శి అజయ్కుమార్ ట్వీట్ చేశారు. హానికారక సాఫ్ట్వేరైన ర్యాన్సమ్వేర్ కంప్యూటర్లను స్తంభింపజేసి(లాక్).. తిరిగి తెరుచుకునేందుకు ప్రతిఫలంగా సగం బిట్కాయిన్ (రూ.1.5 లక్షలు)ను డిమాండు చేస్తున్నట్లు తెలుస్తోంది. లాకీ ర్యాన్సమ్వేర్లో పలు రకాల్ని వ్యాప్తి చేసేందుకు ఒకే తరహా 'సబ్జెక్ట్'లతో కొత్త రకం స్పామ్ మెయిళ్లు వ్యాప్తి చెందుతున్నట్లు హెచ్చరించారు. వీటికి 'ప్లీజ్ ప్రింట్', 'డాక్యుమెంట్స్', 'ఫొటో', 'ఇమేజస్', 'స్కాన్స్', 'పిక్చర్స్' వంటి సర్వసాధారణ సబ్జెక్టు పేర్లుంటాయని వివరించారు. లాకీర్యాన్సమ్వేర్ కోసం లక్ష్యంగా మార్చుకునేందుకు నకిలీ వెబ్సైట్ల లింకుల్ని చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాగంగా 2.3 కోట్లకుపైగా సందేశాలు పంపినట్లు తెలిపారు. ఈమెయిల్స్ తెరిచేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలనీ, వాణిజ్య సంస్థలు స్పామ్ నిరోధకాల్ని ఏర్పాటు చేయాలనీ, స్పామ్గా గుర్తించిన జాబితాను నవీకరించాలని కేంద్రం తన హెచ్చరికలో సూచించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







