వ్యాపిస్తున్న 'లాకీ ర్యాన్సమ్వేర్'..తస్మాత్ జాగ్రత్త..!
- September 02, 2017
కొత్తగా వ్యాపిస్తున్న మాల్వేర్ 'లాకీ ర్యాన్సమ్వేర్'తో జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. లాకీ ర్యాన్సమ్వేర్పై జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అదనపు కార్యదర్శి అజయ్కుమార్ ట్వీట్ చేశారు. హానికారక సాఫ్ట్వేరైన ర్యాన్సమ్వేర్ కంప్యూటర్లను స్తంభింపజేసి(లాక్).. తిరిగి తెరుచుకునేందుకు ప్రతిఫలంగా సగం బిట్కాయిన్ (రూ.1.5 లక్షలు)ను డిమాండు చేస్తున్నట్లు తెలుస్తోంది. లాకీ ర్యాన్సమ్వేర్లో పలు రకాల్ని వ్యాప్తి చేసేందుకు ఒకే తరహా 'సబ్జెక్ట్'లతో కొత్త రకం స్పామ్ మెయిళ్లు వ్యాప్తి చెందుతున్నట్లు హెచ్చరించారు. వీటికి 'ప్లీజ్ ప్రింట్', 'డాక్యుమెంట్స్', 'ఫొటో', 'ఇమేజస్', 'స్కాన్స్', 'పిక్చర్స్' వంటి సర్వసాధారణ సబ్జెక్టు పేర్లుంటాయని వివరించారు. లాకీర్యాన్సమ్వేర్ కోసం లక్ష్యంగా మార్చుకునేందుకు నకిలీ వెబ్సైట్ల లింకుల్ని చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాగంగా 2.3 కోట్లకుపైగా సందేశాలు పంపినట్లు తెలిపారు. ఈమెయిల్స్ తెరిచేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలనీ, వాణిజ్య సంస్థలు స్పామ్ నిరోధకాల్ని ఏర్పాటు చేయాలనీ, స్పామ్గా గుర్తించిన జాబితాను నవీకరించాలని కేంద్రం తన హెచ్చరికలో సూచించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







