'దుబాయ్ పవనిజం' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పవర్ స్టార్ జన్మదిన వేడుకలు
- September 02, 2017
దుబాయ్: పవ నిజం... ఇది బ్రాండ్ కాదు ఒక శక్తి... ఆ శక్తి కి ప్రాణం పోసిన ఒక మహా వ్యక్తి పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముఁడుగా చిత్రసీమకు తెరంగేట్రం చేసినా, అతి తక్కువ కాలంలోనే తన నటనతో మరియు మంచి మనసుతో అశేష అభిమానుల్ని సొంతం చేసుకొని 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో సామాజిక సేవల్లో పాల్గొని యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారు. రైతన్న కోసం ఆయన పడ్డ తపన దేశదేశాల విస్తరించి ప్రపంచం అన్ని మూలల నుంచి అభిమానులు 'మేము సైతం' అని అండగా నిలిచారు.
సెప్టెంబర్ 2 పవన్ అభిమానులకు ఒక పండగ దినం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినమైన ఈ తేదీన దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం ఘనంగా వేడుకలు జరుపుకుంటారు పవన్ అభిమానులు.
దుబాయ్ లోని పవన్ కల్యాణ్ అభిమాన సంఘం "దుబాయ్ పవనిజం" ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా తమ అభిమాన నటుడి జన్మదిన వేడుకను అభిమానుల సమక్షంలో జరుపుకున్నారు. దుబాయ్ పవనిజం ప్రెసిడెంట్ ప్రసాద్ పెద్దిశెట్టి మాట్లాడుతూ గత మూడేళ్ళుగా సేవా కార్యక్రమాలు చేస్తునట్టు తెలిపారు.ఇలాగే మరెన్నో కార్యక్రమాలు చెయ్యాలని తెలియజేసారు.అభిమానులు అందరూ కలిసి కేక్ కట్ చేసారు.ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ప్రసాద్ పెద్దిశెట్టి,రవి చల్లా,తులసి ప్రసాద్ ఎరికి, శ్రీకాంత్ చిత్తర్వు,అప్పాజీ,కేసరి త్రిమూర్తులు, సత్యనారాయణ,సింగిరి రవి కుమార్,సింగిరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.






తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







