మన రైళ్లకు గొప్పోళ్ళ పేర్లు
- September 03, 2017
''మీరు ప్రయాణించాల్సిన డాక్టర్ సి.నారాయణ రెడ్డి రైలు తొమ్మిదో నంబరు ప్లాట్ఫాంపై వచ్చియున్నది''.. ఈ తరహా అనౌన్స్మెంట్ను త్వరలోనే మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విన్నా ఆశ్చర్యం లేదు. అలాగే కోల్కతాలో మహాశ్వేతాదేవీ పేరుతో.. పట్నాలో రామ్ధారీ సింగ్ ధింకర్ పేరుతో రైళ్ల పేర్లు మారతాయేమో!! ఏమిటిలా రైళ్లకు కొత్తగా రచయితల పేర్లు అంటారా? దేశంలో విభిన్న ఆచారాలు, సంస్కృతులు, భాషలున్న ప్రాంతాలను కలపడంలో రైళ్లు వారధిగా నిలుస్తున్నాయి. అలాంటప్పుడు విభిన్న సంస్కృతులను ప్రతిబింబించేలా రైళ్లకు సాహిత్య అకాడమీ తదితర ప్రతిష్ఠాత్మక అవార్డులు సాధించిన రచయితల పేర్లు పెడితే తప్పేమిటి? రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మదిలో మెదిలిన ఆలోచన ఇది. ఆయన సూచనల మేరకు దేశవ్యాప్తంగా రైళ్ల పేర్లను మార్చేందుకుగాను అధికారులు ప్రతిపాదనల తయారీలో మునిగిపోయారు. రైళ్లకు రచయితల పేర్లు పెట్టే దిశగా ప్రాథమికంగా పనులు ఇప్పటికే మొదలయ్యాయని అధికారులు తెలిపారు. నిజానికి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైళ్లు, స్టేషన్ల పేర్లను మార్చారు.
మహారాష్ట్ర ఎక్స్ప్రెస్ ను హిందూ మహాసభ మాజీ అధ్యక్షుడు మదన్ మోహన్ మాలవీయ పేరుతో.. అయోధ్య ఎక్స్ప్రె్సను భారతీయ జనసంఘ్ సిద్ధాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ పేరుతో వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







