భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు
- September 03, 2017
చైనా వేదికగా జరుగుతున్న బ్రిక్స్ దేశాల సమావేశం ప్రారంభమైంది. సోమవారం ఉదయం జియామెన్ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ సెంటర్కు వెళ్లిన ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఘన స్వాగతం పలికారు. సమావేశానికి ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు మైకెల్ టెమర్ సహా బ్రిక్స్ దేశాధినేతలంతా కలిసి గ్రూఫ్ ఫోటో దిగారు. కాగా బిక్స్ సమావేశాల సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు టెమర్తో ప్రధాని మోదీ విడివిడిగా సమావేశమై దైత్య చర్చలు జరపనున్నారు. వీరితో పాటు చైనా అధ్యక్షుడితోనూ ప్రధాని మోదీ సమావేశం కానున్నట్టు సమాచారం. చైనా, భారత భద్రతా దళాల మధ్య డోక్లాం వద్ద దాదాపు రెండున్నర నెలల పాటు కొనసాగిన ప్రతిష్టంభనకు తెరపడిన కొద్ది రోజులకే ఇరు దేశాధినేతలు సమావేశం కానుండడంపై విశేష ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







