భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు
- September 03, 2017
చైనా వేదికగా జరుగుతున్న బ్రిక్స్ దేశాల సమావేశం ప్రారంభమైంది. సోమవారం ఉదయం జియామెన్ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ సెంటర్కు వెళ్లిన ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఘన స్వాగతం పలికారు. సమావేశానికి ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు మైకెల్ టెమర్ సహా బ్రిక్స్ దేశాధినేతలంతా కలిసి గ్రూఫ్ ఫోటో దిగారు. కాగా బిక్స్ సమావేశాల సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు టెమర్తో ప్రధాని మోదీ విడివిడిగా సమావేశమై దైత్య చర్చలు జరపనున్నారు. వీరితో పాటు చైనా అధ్యక్షుడితోనూ ప్రధాని మోదీ సమావేశం కానున్నట్టు సమాచారం. చైనా, భారత భద్రతా దళాల మధ్య డోక్లాం వద్ద దాదాపు రెండున్నర నెలల పాటు కొనసాగిన ప్రతిష్టంభనకు తెరపడిన కొద్ది రోజులకే ఇరు దేశాధినేతలు సమావేశం కానుండడంపై విశేష ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!









