వెడ్డింగ్, ఎంఐసిఇ డెస్టినేషన్గా బహ్రెయిన్
- September 04, 2017
మనామా: బహ్రెయిన్ని వెడ్డింగ్ మరియు ఈవెంట్స్కి సంబంధించి డెస్టినేషన్గా మార్చేందుకోసం ఐలాండ్స్, బీచ్లు, ఎడారి ప్రాంతాల్ని ప్రమోట్ చేయాలని బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటోంది. ఇండియాలో ఇటీవలి కాలంలో విదేశాల్లో ఈవెంట్స్ నిర్వహణ పట్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈవెంట్స్కి కూడా డెస్టినేషన్స్ ప్లానింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే బహ్రెయిన్, ఆ అవకాశాన్ని అందుపుచ్చుకోవాలనుకుంటోంది. భారత్ నుంచి బహ్రెయిన్కి వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న దరిమిలా, డెస్టినేషన్ టూరిజం సౌకర్యాల్ని మరింత మెరుగుపర్చడం, అలాగే ఆయా ప్రాంతాల్ని ఇంకాస్త ఎక్కువగా ప్రమోట్ చేయడం వంటి వాటి ద్వారా భారతలోని డెస్టినేషన్ లవర్స్ని ఆకట్టుకోవాలని చూస్తున్నట్లు బిటిఇఎ వెల్లడించింది. వెయ్యేళ్ళకుపైగానే ఇండియాతో బహ్రెయిన్కి సన్నిహిత సంబంధాలున్నాయనీ, డెస్టినేషన్ వెడ్డింగ్స్తో ఆ సంబంధాలు ఇంకా బలోపేతం అవుతాయని వారు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ, ముంబై సహా పలు ముఖ్యమైన నగరాల్లో బహ్రెయిన్ డెస్టినేషన్ గురించిన ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టడానికి పలు కార్యక్రమాలకు వ్యూహరచన చేస్తోంది బిటిఇఎ.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







