గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న బొంతు
- September 05, 2017
హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను మేయర్ బొంతు రామ్మోహన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మధ్యాహ్నంలోగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైందని అన్నారు. గత ఏడాది భారీ వర్షాలు పడినా అనుకున్నవిధంగానే నిమజ్జనం చేయడం జరిగిందని, ఈసారి కూడా అలాగే చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు మేయర్ తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి గణేష్ శోభాయాత్ర ప్రారంభమైందని ఆయన తెలిపారు. దీనికి పోలీస్ శాఖ కూడా సహకరిస్తుందని బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









