జూనియర్ మాస్ మహారాజు వచేస్తున్నాడోచ్
- September 05, 2017
సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా వారసత్వపు హీరోల హవా నడుస్తుంది. కేవలం హీరోల వారసులే కాకుండా దర్శక, నిర్మాతల తనయులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రవితేజ..పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇండియట్' చిత్రంతో హీరోగా మారారు. అంతకు ముందు చిన్న చిన్న పాత్రలు చేస్తున్న రవితేజ మాస్ ఎలిమెంట్స్ తో మెప్పించడంతో ఇడియట్ లో చంటి గాడు లోకల్ అంటూ మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అందుకే.. ఇండస్ట్రీలో ఇప్పుడు మాస్ మహరాజుగా అభిమానులు పిల్చుకుంటున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా రవితేజ ఎంతో కష్టపడి పైకి వచ్చారని అంటారు...అంతే కాదు ఆయన తమ్ముళ్లు కూడా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మద్య రవితేజ చిన్న తమ్ముడు భరత్ కారు ప్రమాదంలో మృతి చెందారు. ప్రస్తుతం రవితేజ 'రాజా ది గ్రేట్', 'టచ్ చేసి చూడు' చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే 'రాజా ది గ్రేట్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి ముస్తాబవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అక్టోబర్ 12వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా, ఈ చిత్రంలో రవితేజ తనయుడు మహాధన్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. కాకపోతే ఈ సినిమాలో రవితేజ చిన్నతనంలోని పాత్ర మహాధన్ నటిస్తున్నాడట.
సాధారణంగా రవితేజ ఏ ఫంక్షన్లకు తన కుటుంబాన్ని తీసుకు రారు..చానల్స్ లో కూడా ఇప్పటి వరకు తన కుటుంబ సభ్యులను పరిచయం చేయలేదు. అప్పుడెప్పుడో తన ఇద్దరు పిల్లలతో ఉన్న ఫోటో రిలీజ్ చేశారు. అలాంటిది రవితేజ ఒక్కసారిగా తన తనయుడిని వెండితెర ద్వారా పరిచయం చేస్తుండటం విశేషం. భవిష్యత్తులో ఈ కుర్రాడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









