గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న బొంతు
- September 05, 2017
హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను మేయర్ బొంతు రామ్మోహన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మధ్యాహ్నంలోగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైందని అన్నారు. గత ఏడాది భారీ వర్షాలు పడినా అనుకున్నవిధంగానే నిమజ్జనం చేయడం జరిగిందని, ఈసారి కూడా అలాగే చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు మేయర్ తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి గణేష్ శోభాయాత్ర ప్రారంభమైందని ఆయన తెలిపారు. దీనికి పోలీస్ శాఖ కూడా సహకరిస్తుందని బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







