బహ్రెయిన్: లేబర్ క్యాంప్లో కార్మికుల పరిస్థితి దయనీయం
- September 07, 2017
మనామా: అల్ మువాతాసిమ్ అవెన్యూలో కార్మికులు అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో నివసిస్తున్నారు. మొత్తం ఆ భవనమంతా దారుణమైన పరిస్థితుల్లో ఉందని కార్మికులు తెలిపారు. కనీసపాటి మరమ్మత్తులు అయినా చేయాలని ఎన్నిసార్లు ల్యాండ్లార్డ్కి చెప్పినా పట్టించుకోలేదని వారు వాపోయారు. నీటిని, కరెంట్నీ కట్ చేసేస్తే తమ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని భావించే ఏమీ చేయలేకపోతున్నామని వారు అన్నారు. సాయంత్రం వేళల్లో కరెంట్, వాటర్ ఎందుకు రావడంలేదని ల్యాండ్లార్డ్ని ఒక్కోసారి ప్రశ్నిస్తే, ఇడబ్ల్యుఎ అధికారులు వాటిని కట్ చేసేస్తున్నారని సమాధానమిచ్చారని ఓ నివాసితుడు తెలిపారు. ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళాలంటే ఆర్థికంగా ఇబ్బందులు పెరుగుతాయనీ, అందుకే సర్దుకుపోతున్నట్లు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 100 మందికి పైగా కార్మికులు చిన్నపాటి వాటర్ ట్యాంక్ మీద ఆధారపడి ఉంటున్నారక్కడ. అధికారులు మాత్రం ఆ ప్రాంతంలో నీటి సమస్యగానీ, కరెంట్ సమస్యగానీ లేదని చెబుతున్నారు. వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు తగ్గించుకోవడానికి ఓనర్ అలా వ్యవహరిస్తున్నట్లు వారు వివరించారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









