ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవం
- September 07, 2017
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ చివర్లో 30 కిలోమీటర్ల నాగోల్ -మియాపూర్ మార్గంలో మెట్రో పరుగులు పెట్టనుంది. మెట్రో ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూ ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. పీఎంవో నిర్ణయం ఆధారంగా తేదీని ఖరారు చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వ డెడ్లైన్ లోపు పెండింగ్ పనులు పూర్తిచేసేందుకు HMR శ్రమిస్తోంది.
హైదరాబాదీల కలల ప్రాజెక్ట్ నవంబర్లో పట్టాలెక్కనుంది. నాగోలు టు మియాపూర్ మార్గంలో 30 కిలోమీటర్ల మేర మెట్రో అపరేషన్స్ నిర్వహించేందుకు ఏర్పాటు శరవేగంగా సాగుతున్నాయి.ప్రభుత్వ ఆదేశాలతో HMR అధికారులు పనుల్లో వేగం పెంచారు. నవంబర్ లోపే మెట్రోను సిద్ధం చేసేందుకు శ్రమిస్తున్నారు. హైదరాబాద్లో మూడు కారిడార్లలో 72 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. మొదటి కారిడార్లోని మియాపూర్ నుంచి ఎస్సార్ నగర్ వరకు.. మూడో కారిడార్లో నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు ట్రయల్ రన్ ఎప్పటినుంచో సాగుతోంది. ప్రస్తుతం మెట్టుగూడ నుంచి అమీర్ పేట వరకు నిర్మాణ పనులు వేగంగా సాగంగా సాగుతున్నాయి. అత్యంత క్లిష్టమైన ఒలిఫెంటా బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా ముగింపుదశకు వచ్చాయి. ఇది పూర్తయితే అమీర్ పేట వరకు లైన్ క్లియర్ కానుంది. దీంతో నాగోల్ నుంచి అమీర్ పేట , మియాపూర్ మార్గంలో మెట్రో రైలును ప్రారంభించేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది.
ఈ నవంబర్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్ లో జరిగే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. అదే సమయంలో మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో మొదటిదశను ప్రారంభించాల్సిందిగా ఆహ్వానిస్తూ ప్రధానిని సీఎం కేసీఆర్ లేఖ రాశారు.
పట్టణ ప్రాంత ప్రజల రవాణా కోసం నిర్మిస్తున్న అతి పెద్ద ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో రైలునిలుస్తుందని ముఖ్యమంత్రి లేఖలో తెలిపారు. 15 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు.. దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ ప్రాజెక్టు అని కేసీఆర్ గుర్తు చేశారు. గత మే నెల 25నే మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించిన విషయాన్నిగుర్తు చేసిన సిఎం, నవంబర్ నెలలో ఈ కార్యక్రమం పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు నవంబర్లో మెట్రో ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నా..ఇంకా పనులు అసంపూర్తిగా ఉండటంతో గ్రేటర్ వాసుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెట్టుగూడ నుంచి అమీర్పేట వరకు ట్రాక్ ఇంకా పూర్తిగా సిద్దం కాలేదు. ట్రాక్ పూర్తయ్యాకా.. ట్రయల్ రన్ నిర్వహించాల్సి ఉంటుంది. భద్రతాపరమైన అనుమతులు కూడా రావాల్సి ఉంది. దీనికి చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెట్రో రైలు నవంబర్ వరకు ఎలా సిద్ధమవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







