మార్చురీ లో లేచిన శవం
- September 08, 2017
కేరళ: రెండు సార్లు మరణాన్ని చవిచూసిన రత్నం అనే ఒక పెద్దావిడ ఉదంతం ఇది. కేరళకు చెందిన 51 ఏళ్ల రత్నం రెండునెలలుగా మదురై మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. జాండిస్, కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమెకు వెంటిలేటర్ మీదే చికిత్సనందించారు. ఇక లాభం లేదని డాక్టర్లు తేల్చేయడంతో.. ఆఖరిరోజులైనా ప్రశాంతంగా ఇంటివద్ద వుంటారనుకుని కుటుంబీకులు ఆమెను అంబులెన్స్ ఎక్కించారు.
అయితే.. శ్వాస ఆడకపోవడం, కదలిక లేకపోవడాన్ని గమనించి.. మరణించినట్లు నిర్ధారించుకున్నారు బంధువులు. కాసేపు ఏడుపులు.. పెడబొబ్బలు. వెంటనే.. మార్చురీకి తరలించి గంటసేపు అక్కడే ఉంచారు. తీరా అంత్యక్రియల కోసం బైటికి తీయబోతే.. తాను బతికే వున్నానంటూ కళ్ళతో సైగ చేసిందామె. మళ్ళీ అందరిలో ఆనందం. షాక్ నుంచి తేరుకుని ఆమెను సెయింట్ జాన్స్ హాస్పిటల్ లోని ఐసీయూలో అడ్మిట్ చేశారు. డాక్టర్లు, పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది.
దురదృష్టవశాత్తూ ఆ సాయంత్రమే రత్నం 'మళ్ళీ' చనిపోయినట్లు డాక్టర్లు సర్టిఫై చేశారు. ఇలా ఒకే రోజు రెండుసార్లు చనిపోయి 'శవాల గది'లోకెళ్ళి వచ్చిన 'రత్నం' గురించి కేరళలో వింతగా చెప్పుకుంటున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









