పెరిగిన బంగారం ధర.. మరింత పెరిగే అవకాశం
- September 08, 2017
పసిడి ధరలు ఆకాశాన్నితాకుతున్నాయి.. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 990 రూపాయలు పెరిగింది. బులియన్ మార్కెట్లో పది గ్రాముల ధర 31వేల 350కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి 42వేలకు చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతోనే బంగారం ధర పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2015 కనిష్ఠానికి డాలర్ విలువ పడిపోవడం కూడా దోహదపడుతోంది. 2016 సెప్టెంబరు తర్వాత ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి.
ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హరికేన్ ఇర్మా ప్రభావం బంగారం ధరలపై ప్రభావం చూపాయి. యుద్ధ వాతారణం నేపథ్యంలో షేర్ మార్కెట్లలో పెట్టబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం లేదు. నమ్మకమైన పెట్టుబడిగా మారిన బంగారం వైపు చూస్తున్నారు. ఉత్తరకొరియా వివాదం నేపథ్యంలో మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. బంగారం ధరల పెరుగుదలలో 15 శాతమే ఉత్తరకొరియా సంక్షోభం వల్లేనని మార్కెట్ వర్గాలంటున్నాయి. ఇక హారికేన్ ఇర్మా అమెరికాపై తీవ్ర ప్రభావం చూపాయి. అంచనావేసిన దానికంటే బలహీనంగా జాబ్ డేటా విడుదలైంది. ఇవన్నీ డాలర్పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతో బంగారం ధరలు పెరిగాయి.
వాషింగ్టన్లో గడచిన రెండు నెలల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు డాలర్ బలహీనతకు, పసిడి పరుగుకు దారితీస్తున్నాయి. ఇటు అమెరికాలో అనిశ్చిత రాజకీయ, ఆర్థిక పరిస్థితులు కానీ, అటు ఉత్తరకొరియాకు సంబంధించి ఘర్షణాత్మక వాతావరణం కానీ సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం లేదు. ఇక దీర్ఘకాలంలో అమెరికా ఫెడ్ ఫండ్ రేటు యథాతథంగా కొనసాగే అవకాశమూ లేదు. దీంతో
ఎక్కువకాలం బంగారం ధరలు ర్యాలీ కొనసాగే అవకాశం లేదంటున్నారు. ఈ ఏడాది చివరకు అంతర్జాతీయ మార్కెట్లో బంగారు ఔన్స్ 1,250 డాలర్ల వద్దకు తిరిగి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







